ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ పై జగన్ వ్యక్తిగత దూషణ: డా. మిడతాన

విజయనగరం: శ్రీ జగన్ రెడ్డి గారు ఓటమి భయంతో అభద్రతాభావంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణ చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు శ్రీ డా.రవి కుమార్ మిడతాన తెలిపారు. శుక్రవారం విలేకరులతో మిడతాన మాట్లాడుతూ కుటుంబం అంటే గౌరవం లేని వ్యక్తివి నువ్వు కాదా తన సొంత తల్లి, చెల్లి మీద చులకన భావం జగన్ రెడ్డిది, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వ్యక్తివి ఐతే దమ్ముంటే సొంత బాబాయి హత్య కేసు మీద పోరాడుతున్న చెల్లెలికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, తన రాజకీయ స్వలాభం కోసం సొంత కుటుంబంలోని తల్లిని చెల్లిని రోడ్లపై తెచ్చి రాజకీయంగా వాడుకొని ఈరోజు తన సొంత తల్లిని చెల్లినీ తరిమేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి, ఈరోజు వారు ఆంధ్రా నుంచి గెంటితే తెలంగాణలో పడ్డారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకో, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు, నిన్ను ఎన్నుకున్న పాపానికి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేని నువ్వు, వారాహి యాత్ర ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్లపైకి వచ్చి మీ పరిపాలన పై ప్రజల మధ్యన ఎండగడతా ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు గురించి మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిరంగ సభలలో న్యాయబద్ధంగా విడిపోయిన మహిళల ప్రస్తావన తెచ్చిన నీవు రాజకీయ అజ్ఞానివి, రాజ్యాంగం తెలియదు రాజ్యాంగ విలువలు తెలియని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు, బహిరంగ సభలలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో తను రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పవలసింది పోయి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మాత్రమే జగన్ రెడ్డి పంతాగా మారింది, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ నవ్వాలో తెలియదు, రాష్ట్రంలో పరిపాలన ఎలా చేయాలో తెలియదు, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో తెలియదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తామన్నారు, రాబోవు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారని అని తెలిపారు.