సఖినేటిపల్లిలో దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారం

రాజోలు, జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మొదటి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్లో భాగంగా గురువారం సఖినేటిపల్లి గ్రామం అయినవల్లి సత్యనారాయణ ఇంటి వద్ద అట్టహాసంగా ప్రారంభించబడింది. సఖినేటిపల్లి మండల తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు యువత పాల్గొన్నారు.