తాడేపల్లిగూడెం వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండల దర్శిపర్రు గ్రామంలో గ్రామ ప్రెసిడెంట్ శ్రీమతి కొల శేషవేణి మరియు ఆ గ్రామ వీరమహిళా విభాగం వారు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడేపల్లిగూడెం వీరమహిళా విభాగం చైర్మన్ శ్రీమతి మధులత కసిరెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ తెలుగు వారి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ప్రధానమైనది. భోగి భోగాలతో సరితూగాలి అని సంస్కృతి సాంప్రదాయాల నెలవైన సంక్రాంతి ఇంటి ముందు గొబ్బెమ్మలు రంగురంగుల ముగ్గులతో హరివిల్లుల మెరవాలి అని పండగ ప్రత్యేకతలు వివరిస్తూ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.