గెద్దాడ గ్రామంలో జనసేన, టి.డి.పి, బిజెపిల ఎన్నికల ప్రచారం

మామిడికుదురు మండలం, గెద్దాడ గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన టీడీపి బీజేపీ మండల అధ్యక్షులు అధ్వర్యంలో సమావేశంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మరియు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ బిసి డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడమే కాకుండా ఎస్సీలకు ఇవ్వవలసిన 19% ఇవ్వల్సిన రిజర్వేషన్ 12% శాతానికి తగ్గించి మోసం చేస్తున్న జగన్ రెడ్డికి ఊడిగం చెయ్యొద్దు అని చెబుతూ.. ప్రజా సమస్యలు త్రాగు నీరు, డ్రైనేజ్ సమస్య, కరెంటు రోడ్లు సమస్య, తదితర సమస్యలు తెలుసుకుని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ.. ఎమ్మెల్యే అభ్యర్దికి గాజు గ్లాసు, ఎంపీ అభ్యర్ధికి సైకిల్ గుర్తుపై తమ అమూల్య మైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి అభ్యర్ధి దేవ వరప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపి బీజేపీ పార్టీల రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.