అమరావతి రైతు పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఏలూరు జనసేన

ఏలూరు, అమరావతి రైతుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా సోమవారం పెదపాడు చేరుకున్న అమరావతి రైతు సోదరులకు సంఘీభావం తెలిపిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. అనంతరం మూడు రాజధానులు వద్దు ఒక రాజధానే ముద్దు అంటూ రైతులు నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.