అవినీతి పరులకు కొమ్ము కాసింది చాలు… ఇక నిజాయితీగల జనసేన పార్టీని గెలిపిద్దాం – బత్తుల

రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో “జనంకోసం – జనసేన” “మహా పాదయాత్ర” లో “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, భూపాలపట్నం సర్పంచ్ శ్రీమతి గుల్లింకల అన్నపూర్ణ లోవరాజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈసారి పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టాలని, భావితరాల భవిష్యత్తు కాపాడాలని అభ్యర్థిస్తూ, అవినీతిపరులకు అవకాశం ఇవ్వడం వల్ల మన భవిష్యత్తుతో పాటు, భావితరాల భవిష్యత్తు కూడా పాడైపోయిందని, నిజాయితీపరుడైన “పవన్ కళ్యాణ్” కి ఒక అవకాశం ఇచ్చి జనసేన పార్టీని గెలిపించాలని, జనసేన కరపత్రాలు పంచుతూ సాగిన ఈ కార్యక్రమం ప్రజల ఆదరణతో ముందుకు సాగింది. జనసేన నాయకులు గుల్లింకల లోవరాజు పాదయాత్ర సందర్భంగా గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరాం, శ్రీమతి గుల్లింకల అన్నపుర్ణ లోవరాజు, మేడిం విష్ణు, పంతం శ్రీనివాస్, పంతం మంగ, సుంకర దొరబాబు, గండి రత్నాలరవు, మేడిం నాగేశ్వరావు, మేడిం వెంకట సూర్యనారాయణ, పంతం గంగరాజు, పామర్తి శ్రీను, తూము సత్తిబాబు, మేడిం శ్రీను, పంతం వెంకట రమణ, పంతం చంటి, గణేశులు సత్తిబాబు అనిశెట్టి భిమేష్, రాయుడు శ్రీను, టపాస్ కుమార్, పంతం శ్రీను, మేడిం లక్ష్మణరావు, మేడిం దుర్గారావుపంతం పెద్ద తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.