మదనపల్లి నియోజకవర్గం కొంగు బంగారు తల్లి సిటిఎం అమ్మ వారి వద్దకు చేరిన మదనపల్లి జిల్లా నిరసన కార్యక్రమం

మదనపల్లి జిల్లా కావాలి అని మదనపల్లి జిల్లా సాధన జెఏసి ఆధ్వర్యంలో మదనపల్లెలో గత 25 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు జనసేన తరపున మద్దతుగా పాల్గొంటూ మదనపల్లిని జిల్లాకు తగ్గ అర్హతలు ఉన్నాయి అని గుర్తించి మదనపల్లి నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల రైతులకు, పట్టణ ప్రజలు, లాయర్లు, ఆటో సంఘాలు, టైలర్లు, వర్తకులు ఈ విధంగా 4 నియోజక వర్గాల్లో మదనపల్లి జిల్లా చేయాలి అని నిరసనలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు… జాతీయ గీతాని రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీ నుంచి ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి జాతీయ గీతానికి లయ కట్టిన ప్రదేశాన్ని ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అన్ని మౌళిక సదుపాయాలు కలిగి ఉన్న మదనపల్లి చుట్టుపక్కల వున్న తంబళ్లపల్లె నియోజకవర్గం, పీలేరు, పుంగనూరు నియోజకవర్గం వారికి చేరువలో ఉంది కాబట్టి పాలకులు ప్రజలకు అనుకూలంగా వున్న మదనపల్లిని జిల్లా చేయాలి అన్నివిదాలుగా ఎల్లప్పుడూ అనుకూలంగా వాతావరణం వున్న మదనపల్లె జిల్లాకు సరైన ప్రదేశం. మదనపల్లి నియోజకవర్గం ప్రజల దైవం అయిన సిటిఎం నలవీర గంగా భవాని అమ్మను తమ మొర ఆలకించి ప్రభుత్వ మనసు మార్చి మదనపల్లి జిల్లాను చేయాలి అని మదనపల్లి జిల్లా సాధన జెఏసి సభ్యులు కోరారు. ఈ నెల 21వ తేది చిత్తూరు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాలు సమర్పిస్తామనీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు నాయకులు పాల్గొన్నారు.