సత్తెనపల్లిలో జనసేనలో చేరికలు

సత్తెనపల్లి జనసేన పార్టీ రూరల్ మండలం కార్యాలయంలో మొక్కపాడు గ్రామ మాజీ సర్పంచ్ నేలటూరి జగన్నాధం మరియు మొక్కపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ భృగుబండ చిన్న సైదాలు జనసేన పార్టీలో చేరారు. సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మొక్కపాడులో పార్టీ అభివృధ్ధికి కృషి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు భాషా, జాన్ పీరా, ధూళిపాళ్ళ మాజీ సర్పంచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు.