రాజంపేట జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

రాజంపేట, డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాజంపేట జనసేన నాయకులు వెంకటేశ్వరరావు రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక జనసేన నాయకులతో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉండే బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఒక్కరూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, మల్లెం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.