రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళులు

పిఠాపురం, భారతరత్న, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా పలు ఆహ్వానాలతో, వివిధ గ్రామాలు, మరియు పట్టణ ప్రదేశాలలో భీమ్ యువత నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను పాల్గొని మహనీయుని ప్రతిమను పుష్పాలతో అలంకరించిఘన నివాళులు తెలిపిన పిఠాపురం జనసేన పార్టీ నాయకులు. నియోజకవర్గ వ్యాప్తంగా భీమ్ యువత నిర్వహించిన ఈ మహోత్సవ వేడుకలకు నియోజకవర్గ దళిత నాయకులు మరియు రూరల్ మండల జనసేన నాయకులు వాకపల్లి సూర్యప్రకాష్ నేతృత్వంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శిరీష సమక్షంలో, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులైన ఊట ఆది విష్ణు, మరియు వెన్నా జగదీష్, జనసేన పార్టీ కందరాడ ఎంపిటిసి పిల్లా సునీతమ్మ సూర్యనారాయణల ఆధ్వర్యంలో పట్టణ జనసేన నాయకులైన పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి, మేళం రామకృష్ణ, అమ్మ రాజశేఖర్, మైన బత్తుల చిన్న, రూరల్ మండల నాయకులైన రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్, తాటికాయల ప్రసాద్, దాసం పట్టాభి, పాటి రవి, మొదలగు జనసేన నాయకులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.