అడ్డగోలుగా పోస్టులు రిటైర్డ్ అయ్యాక కూడా ఉద్యోగాలు..
సెక్యూరిటి గార్డులు ఖరీదైన కార్లు భారీ వేతనాలు అదంతే అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇలా చేసే గత ప్రభుత్వం మాయని మచ్చ తెచ్చుకొనింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తున్నారు కులం ఆ కులంలో ఉన్నవారు అడగానే పెద్దపీట కాదు ఏకంగా పెద్ద స్టూలే వేసి కూర్చో పెడుతున్నారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది పదవీ విరమణ చేసిన అధికారులకు పోస్టింగులు ఇచ్చారు చిన్నాచితక పోస్టింగులు కాదు కీలక పదవులు పోనీ ఇటీవల జీవో ప్రకారం కాదు రిటైర్డ్ అయి కూడా ఐదేళ్లు పదేళ్లు దాటిన వారికి ప్రధాన పోస్టింగులు ఇస్తున్నారు దెబ్బలకు కొదవ అని ఒక సామెత ఉంది అలా ఉంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం లో డీజీపీ కార్యాలయం నుండి పలు జిల్లాల్లో కీలక పదవుల్లో రిటైర్డ్ అయిన వాళ్లే అసలే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాట తప్పిన ఈ ప్రభుత్వం లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇలా రిటైర్డ్ అయిన అధికారులను మళ్లీ నియమించాల్సిన అవసరం ఏముందని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.