పెట్రో భారం కేంద్రం తగ్గించినా మీ బాదుడు ఎందుకు ఆపరు..?: దారం అనిత

*ఏపి ప్రజలు ఏం పాపం చేశారు..??

పన్నుల భారంలో రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపిన ఘనత ఏపి సీఎం జగన్ కే దక్కింది. డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రాలు తమ పరిధిలో పన్నులు తగ్గించుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. మరి ఏపి ప్రజలు ఏం పాపం చేశారు..??? ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికీ పైసా తగ్గించక పోగా.. అదనపు పన్నులతో సామాన్యులను మరింత ఇబ్బందులు కు గురి చేస్తున్నారు. పెట్రోల్ ధరలు బాదుడు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసరాల ధరల భారానికి ఇదే కారణం అవుతోంది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని జనసేన పార్టీ తరఫున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.