కొటికలపూడి గోవిందరావు జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొటికలపూడి గోవిందరావు జన్మదిన సందర్భంగా మంగళవారం భీమడోలు మండలంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఉంగుటూరు నియోజకవర్గ జిల్లా కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు.