జనసేనలో ఉండే ప్రతి కుటుంబం పవన్ కళ్యాణ్ కుటుంబంలో భాగమే.. గాదె

  • క్రియాశీలక కార్యకర్త కాలిశెట్టి శ్రీనివాసరావు కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత
  • జనసేన పార్టిలో ఉండే ప్రతి కుటుంబం పవన్ కళ్యాణ్ కుటుంబంలో భాగమే.. వారికీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు.. గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు మునిసిపల్ పరిధిలో ఉన్న 16వ వార్డ్ ఏటుకూరు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త కాలిశెట్టి శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్న కాలిశెట్టి శ్రీనివాసరావు ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం నియోజకవర్గం నాయకులు చట్టాల త్రినాధ్, దాసరి వాసు, ఉప్పు రత్తయ్య మరియు తన్నీరు గంగరాజులనుండి పూర్తి సమాచారం సేకరించి జనసేన కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చనిపోయిన కార్యకర్త యొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు పంపించి, శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు.. ఈ మేరకు గురువారం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలసి గాదె శ్రీనివాసరావు ఇంటికి వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా కాలిశెట్టి శ్రీనివాసరావు సతీమణి కాలిశెట్టి రమాదేవికి మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపి, వారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి పవన్ కళ్యాణ్ పంపిన చెక్కుని కాలిశెట్టి రమాదేవికి అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా కాలిశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమకు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం అని తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, ఉప్పు రత్తయ్య, చట్టాల త్రినాధ్, సిరిగిరి శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరావు, శిఖా బాలు, వల్లెం శ్రీను, గుంటూరు టౌన్ అధ్యక్షులు నేరెళ్ల సురేష్, 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి దుర్గ, 47 వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, డేగల ఉదయ్, టౌన్ కమిటీ సభ్యులు చింత రాజు, కటకం శెట్టి విజయలక్ష్మి, సూరిశెట్టి ఉపేంద్ర, పావులూరి కోటి, నిశ్శంకరావు నవీన్, మధులాల్, గంగరాజు మరియు గ్రామ జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.