రాక్షస వైసిపి పాలనలో ప్రతి ఒక్క వర్గం వెనకబడిపోయింది: మనుక్రాంత్ రెడ్డి

  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

నెల్లూరు: 41వ డివిజన్ సాయి (సాయి ధరంతేజ్ యువత) ఆధ్వర్యంలో 11వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దాసరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ నగర్ లోని యువకులు పవన్ నేతృత్వంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ నుంచి జనసేన జిల్లా పార్టీ ఆఫీస్ వరకు యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు, జిల్లా అధికారి ప్రతినిధి కృష్ణ రెడ్డి, పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానిచ్చారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాక్షస వైసిపి పాలనలో ప్రతి ఒక్క వర్గం వెనకబడిపోయింది, యువతకు ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు, యువతకి మంచి భవిష్యత్తు ఉండాలంటే రాబోవు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే నగర అధ్యక్షులు సుజయ్ బాబు మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎలక్షన్ల లో పోటీ చేస్తున్న మనక్రాంత్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యతని యువకులు అందరూ తీసుకోవాలని తెలిపారు. అలాగే జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగరంలోని అభిమానులు అందరూ కూడా ఒకే తాటిపై నిలబడి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటట్లుగా నగరంలో మనక్రాంత్ రెడ్డి గారు సైన్స్ సప్లై అయ్యేలా కష్టపడాలని సూచించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అలియా, నగర కార్యదర్శి దాసరి మాధురి, 11వ డివిజన్ ఉపాధ్యక్షులు డీకొల్లు సత్య, రామిశెట్టి సుధాకర్, ప్రధాన కార్యదర్సులు కొండా వానబాబు, చిన్ని పృథ్వి రాజ్, ఏ రమేష్, కత్తుల సురేష్, ప్రధాన కార్యదర్శి అభినయ సంయుక్త కార్యదర్శులు జి రాంబాబు, డి సత్యం, కె నరేంద్ర (పండు), తదితరులు పాల్గొన్నారు.