ఎండలకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: బొంతు రాజేశ్వరరావు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజవర్గం సఖినేటిపల్లి మండల పరిధిలోని మోరిపోడులో ఉపాధి కూలీలకు మానవ హక్కుల చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ అందజేసిన మజ్జిగను రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో బయట పని చేసే ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పర్తి హరివేలు మంగతాయారు నాని, ఎంపిపి వీర మల్లిబాబు ముప్పర్తి నాని ప్రసాద్, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.