రాజ్యాంగ విలువలను కాపాడగలిగే వ్యక్తి జనసేనాని మాత్రమే: బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, కొత్తపేట నియోజకవర్గం ప్రజలతోపాటు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రేపటి భవిష్యత్తు తరాలకు రాజ్యాంగ విలువలను పూర్తిగా కాపాడగలిగే నాయకుడు ఒక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమేనని, అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆదరించ గలిగే గొప్ప వ్యక్తి, మానవతావాది, మన నాయకుడు జనసేనాని అని, గర్వంగా రాష్ట్ర ప్రజలు చెప్పుకునే రోజు అతి దగ్గరలో ఉన్నదని, జనవరి 26 రిపబ్లిక్ డే, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రం, ఉండాలని ఎంతోమంది దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులు ప్రతి ఒక్కరికి ఘనమైన నివాళులు తెలియజేశారు. అదే విధంగా రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా రచించి, ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైన వ్యక్తి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారిని కొనియాడారు. అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతున్న మన నాయకుని జనసేనానికి, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు జన సైనికులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.