పర్యావరణానికి ప్రతీఒక్కరూ నడుం బిగించాలి

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం

గజపతినగరం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జామి మండలంలో మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మర్రపు సురేష్ మాట్లాడుతూ పుట్టినరోజును పురష్కరించుకుని మొక్కలు నాటడం ఎంతో అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ వారివారి పుట్టినరోజు నాడు ఒక్క మొక్కైనా నాటాలని, బహుమతులుగా మొక్కలు ఇవ్వడం చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి పుట్టినరోజులను హంగులు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తుంటామని, ఈరోజు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, జామి మండలం నాయకులు వర్మరజు, ఆదినారాయణ, రాంబాబు, గోవింద్, బాలకృష్ణ, జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.