Vizag: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సభకు సర్వం సిద్దం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 31న సభకు సర్వం సిద్ధమైంది. సభా ప్రాంగాణాన్ని రెడీ చేస్తుండగా.. పోలీసులు అడ్డుకోవటం, మరో చోటకు సభా వేదికను మార్చాలని ఆదేశించారు.. ఉత్కంఠ పరిణామాల మధ్య కొంత గందరగోళం ఏర్పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం సభకు అనుమతి ఇచ్చింది.. సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ప్రాంగణం అంత జనసేనాని పేరుతో మార్మోగింది. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణలో జనసేన నాయకులు ఏడిద భార్గవ్, విజయ్ కుమార్, కరుణాకర్ మరియు కృష్ణ చైతన్య పాల్గొన్నారు.