Kothapeta: ఉక్కు మనిషిగా జనసేనాని ఉక్కుదీక్షకు తరలి రండి బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పిలుపు!

ఉక్కు మనిషిగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టే విశాఖ ఉక్కుదీక్షకు రండి! లక్షలాదిగా తరలి రండి!బండారు శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పిలుపు!

ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా!
ఉక్కు మనిషిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు,ఆంధ్రరాష్ట్ర నిరుద్యోగ బిడ్డల భవిష్యత్తు కాపాడుకునేందుకు విశాఖలో రేపు ఉక్కుదీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంకి బలాన్ని చేకూరుద్ధాము-రేపటి భావితరాల మీ బిడ్డల భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ఉద్యమానికి అండగా నిలబడదాం! రండి కదలిరండి-లక్షలాదిగా తరలిరండి!!! తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకూడదని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం అక్టోబర్ 31వ తేదీన చేపట్టే ఉక్కుదీక్షకు లక్షలాదిగా తరలి రావాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, దృఢ సంకల్పంతో మన రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పరితపిస్తున్న గొప్ప నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆశ దీపంగా కుళ్లు కుట్ర రాజకీయాలను ఎదిరించగల ఉక్కుమనిషిగా జనసేనాని చేపట్టే ఉక్కు దీక్షకు అన్ని వర్గాలు, అన్ని కులాలు వారు ఐక్యమై జనసేనాని నాయకత్వానికి అండగా బలం చేకూర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జనసేనాని చేపట్టే విశాఖ ఉక్కు దీక్ష కనువిప్పు కావాలని, లక్షలాదిగా తరలిరండి! మన రాష్ట్రాన్ని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, నిరుద్యోగ యువత కోసం కాపాడుకుందామని పిలుపునిస్తున్నాము.జిల్లా ఇన్చార్జి, జనసేన రథసారధి కందుల దుర్గేష్ నాయకత్వంలో లక్షలాదిగా రండి! కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.