పేస్ సెల్ఫీ విధానాన్ని గిరిజన ప్రాంతాల్లో మినహాయింపు ఇవ్వండి

మాదాల శ్రీరాములు అరకు నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు

అరకు నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు మాత్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతంలో పూర్తిస్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేసే వరకు పేస్ సెల్ఫీ విధానాన్ని అమలు చేయడం సరైన పద్ధతి కాదు అంతూ వెంటనే పేస్ సెల్ఫీ విధానాన్ని గిరిజన ప్రాంతంలో నిలిపివేయ్యాలి.. నెట్ వర్క్ లేని చోట పేస్ సెల్ఫీ విధానాన్ని ఎలా అమలు చేస్తారు. ముందుగా అల్లూరి జిల్లాలో నెట్ వర్క్ సమస్య తీర్చండి.. మండల కేంద్రం దాటితే ఎక్కడ ఫోన్ సిగ్నల్స్ పనిచేయనప్పుడు పేస్ సెల్ఫీ విధానం ఎలా అమలు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని.. ప్రశ్నించారు. సిపిఎస్ అమలు కోసం ఉద్యమం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు మీద కక్ష కట్టింది. ప్రభుత్వం కేవలం ఉపాధ్యాయ లను టార్గెట్ చేసి ఇబ్బంధులు చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా గిరిజన ప్రాంతపు నెట్వర్క్ సమస్య ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సమయంలో ప్రభుత్వం కొత్త సమస్యను సృష్టించి ఉపాధ్యాయులను గందరగోళాన్ని చేసి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసిన పేస్ సెల్ఫీ విధానాన్ని వెంటనే నిలిపి వేయాలని శ్రీరాములు డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *