వైసీపి ప్రభుత్వంలో పండించే రైతులకు అసంతృప్తి: పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలంలోని సిరిపురం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి & పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి 15వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు వీధి లైట్లు లేవని, ప్రభుత్వాలు మారుతూ ఉన్నా రైతులు కష్టాలు మాత్రం మారడం లేదు. ధాన్యము రోడ్లపై ఆరపెట్టుకోవడమే కానీ వాటికి సరైనా ప్లాట్ ఫార్మలను నిర్దేశించని ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రిగా అమలులోకి తెప్పించలేకపోయారని ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన మారాలి అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.