నరసన్నపేట నియోజకవర్గంలో జనసేన, టీడీపీ సమన్వయ సమావేశం

నరసన్నపేట నియోజకవర్గం: జనసేన తెలుగుదేశం ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ, గ్రామ, పంచాయతీ స్థాయిలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగి 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించే విధంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా. విశ్వక్ సేన్, జనసేన తెలుగుదేశం ఉమ్మడి సమన్వయ కమిటీ అధ్యక్షులు ప్రవిన్ కుమార్, జనసేన పార్టీ నరసన్నపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు నడుపూరు తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.