రౌడీ పార్టీ మాది కాదు…మీదే.. సీఎం వాఖ్యలకు పితాని కౌంటర్

ముమ్మిడివరం: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సామాన్యుల పక్షాన ఉంటున్న తమ పార్టీని రౌడీ పార్టీ గా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దొంగే..దొంగ దొంగ..అన్నట్టు ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ విమర్శించారు. నరసాపురం లో జరిగిన ప్రపంచ మత్యకార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలోనే దొంగలు, ముఠా కోరులు ఉన్నారని, మీ నాయకులు చేస్తున్న దాష్టికాలను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. చక్కటి క్రమ శిక్షణ తో నడుచు కుంటున్న తమ పార్టీ పై ఇలా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. మీ స్వంత బాబాయిని హత్య చేస్తే దోషులెవరో నేటి వరకు ఎందుకు తేల్చుకోలేకపోయారు అన్నారు. జనసేన పార్టీ అంటే అధికార పార్టీకి భయం పట్టుకుంది అని అన్నారు. ఎవరు ఏమి చేసినా రానున్నది జనసేన ప్రభుత్వం అని, దానిని ఆపడం ఎవరి వల్ల కాదు అని బాలకృష్ణ అన్నారు.