పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం పోలవరం గ్రామంలో అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న చీకురుమిల్లి సత్యనారాయణ కుమారుడు నాగేంద్ర కు పోలవరం జనసేన నాయకులు, గ్రామాకమిటి ఆధ్వర్యంలో 10,000 హాస్పిటల్ ఖర్చుల నిమ్మిత్తం అందచేశారు. అలాగే టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకులు ముమ్మిడివరం శేఖర్ ఇల్లు అకాల వర్షం కారణంగా కూలిపోయింది వారికి 25 కేజీల రైస్ ప్యాకెట్ అందచేసి అన్నివిధాలా ఆదుకుంటాం అని చెప్పారు. అదే గ్రామంలో కరంట్ స్థంభం పడిపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు ఐ పోలవరం మండలం దుప్పిలంక గ్రామంలో ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడి ఇంటిదగ్గర కోలుకుంటున్న ఉద్దీస కృష్ణ మూర్తిని పరామర్శించారు. వీరివెంట మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, దేవు రాంబాబు, రాయపురెడ్డి బాబీ, పితాని రామకృష్ణ, బొంతు కనకారావు, దూడల స్వామి, రేవు లక్ష్మి కళ, పితాని రాజు, సవరపు వెంకట్, పెన్నాడ శివ, వంగా సీతారాం, వాసంశెట్టి బాబ్జి, పాటి శ్రీను, నరాలశెట్టి రాంబాబు, నిమ్మకాయల సత్యనారాయణ, పలివెల వెంకటేశ్వరరావు, మట్టా ఏసుబాబు, చిక్కాల సత్యనారాయణ, గాలిదేవర వీరభద్రరావు, మామిడాల లక్ష్మణ మూర్తి, కాశి భాస్కరరావు, పూలపకూర రమణ మొదలగువారు పాల్గొన్నారు.