Guntur: చెరుకుపల్లిలో జనసేన బలపరిచిన అభ్యర్థి విజయం

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎనిమిదో వార్డుకు పోటీచేసిన జనసేన పార్టీ బలపరిచిన జజ్జర శ్రీనివాసరావు(కాంతారావు) వైసిపి బలపరిచిన అభ్యర్థి బర్మా వేణుగోపాల్ పై 15ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జి కమతం సాంబశివరావు మాట్లాడుతూ జజ్జర శ్రీనివాసరావును గెలిపించిన చెరుకుపల్లి 8వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి అహర్నిశలు శ్రమించి పాటుపడిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజయానికి తోడ్పడిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం జనసేన పార్టీ శ్రేణులు కృషి నిదర్శనం అన్నారు. ఇది ప్రజా విజయమని కొనియాడారు.