లాలుపురం జనసేన కార్యాలయంలో జాతిపిత, శాస్త్రిల జయంతి వేడుకలు

ప్రత్తిపాడు నియోజకవర్గం: లాలుపురం గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలకి గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈసందర్భంగా ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ ఒకరు భారతదేశ స్వాతంత్ర్యానికి కారణమైన నాయకులలో ముఖ్యులు జాతిపిత మహాత్మాగాంధీ గారైతే మరోకరు స్వాతంత్ర్య భారతావనిలో ముఖ్యమైన నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారని వారివురి జయంతి సందర్భంగా మహనీయులు ఇద్దరికి ఇవే నా ఘన నివాళులు అని వెంకట రత్తయ్య అన్నారు. లాలుపురం గ్రామ జనసేన పార్టీ ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు (మాష్టారు) మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ అహింసా మార్గంలో శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిన ఆరని, అలానే భారతమాత ముద్దుబిడ్డ భారత దేశం స్వాతంత్ర్య సమర యోధుడు జైకిసాన్ జై జవాన్ స్పూర్తి ప్రదాత లాల్ బహదూర్ శాస్త్రి గారని అయన అన్నారు. ఈకార్యక్రమంలో గుంటూరు రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి అక్కి రవిశంకర్, గుంటూరు రూరల్ మండలం కార్యదర్శి తోట వెంకటేష్, లాలుపురం గ్రామ జనసేన పార్టి సినియర్ నాయకులు శీలం శ్రీహరి, ఆదూరి శివయ్య, కంచర్ల తిరుపతిరావు, సజ్జల రవికుమార్, సూదాబత్తుల శివయ్య, మరియు యూత్ నాయకులు ఆకుల శేషు, తన్నీరు చిన్నక్రిష్ణ, చెన్నం గోపి, గాజుల అనిల్, అములోతు రాంబాబు, తోట శివ, అములోతు రాధ, కాటూరి గోపి గంధం బ్రహ్మం, గ్రామ పెద్దలు శృంగారపు భాస్కరరావు, తన్నీరు రాము తదితరులు పాల్గొన్నారు.