కేశనకూరు గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’ నిర్వహించిన పితాని

అంబెడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నా సేన నాకోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా ఐ.పొలవరం మండలం కేశనకూరు గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యటించడం జరిగింది. గడప గడపకు తిరుగుతూ జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అభ్యర్థిస్తూ గ్రామంలోని పెద్దలకు జనసేన పార్టీ సిద్దాంతాలను తెలియజేసి పార్టీలోకి రావాలని అభ్యర్థించడం జరిగింది. కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగస్వాములై 7288040505 అనే నంబరుకు ఫోన్ పే/గూగుల్ పే ద్వారా జనసైనికులు స్వచ్చందవిరాళాలు చేయించాలని తెలిపారు. ఈ సందర్భంగా జనసేనకు, స్వశక్తినే నమ్ముకుని జనసేన పార్టీ స్థాపించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మద్దింశెట్టి పురుషోత్తం, గోదశి పుండరీష్, బొంతు కనకరావు, రాయపురెడ్డి బాబీ, గుత్తుల శ్రీను, చిక్కం చిన్నబాబు, కొప్పిశెట్టి గణేష్, పితాని రామకృష్ణ, తెమిరెడ్డి రామకోటి, గంజా యేసు, జనసేన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.