ఆయనను మేము కాపాడుకుంటాం

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కుట్ర పొంది బుధవారం రాత్రి రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ వెంట మేమున్నామని ఆయనను మేము కాపాడుకుంటామని అన్నారు. పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుందని, పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని జనసేన నాయకులు కోరారు.