జనసైనికుని కుటుంబానికి క్రిస్మస్ కానుకగా ఆర్థిక సహాయం

గుంటూరు: క్రిస్మస్ పండగ పర్వదినమున గుంటూరు 16వ వార్డు పరిధిలోని బుడంపాడు గ్రామంలో ఇటీవల చనిపోయిన జనసైనికుడు మాతంగి సుమన్ కుటుంబానికి వారు జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా బుడంపాడు గ్రామ జనసేన విభాగం ఆధ్వర్యంలో క్రిస్మస్ కానుకగా వారి చిన్నారులకు పండుగ నిమిత్తం 7000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుక రాజు, నగర కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు 16 డివిజన్ అధ్యక్షులు విష్ణుమొలకల ఆంజనేయులు, 16 వార్డు జనసేన నాయకులు కుర్రా రవికుమార్, దాది ఆంజనేయులు, లింగాల నాంచారయ్య, మాతంగి సాంబయ్య మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. వారికి చిరు ఆర్థిక సాయంతో పాటు జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియపరచి 16 వార్డు తరఫున వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది.