గిద్దలూరు జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

గిద్దలూరు నియోజకవర్గం, అర్ధవీడు మండలం, పాపినేనిపల్లి గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న కాలనీలను సోమవారం జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబా గారు పరిశీలించడం జరిగింది ఈ లేఔట్ లో 141 గృహాలు కేటాయించగా ఒక్కరు కూడా బేస్మెంట్ కూడా ప్రారంభించలేదు కారణం ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో స్థలాలను కేటాయించడమే అని జనసేన పార్టీ ఇన్చార్జి బెల్లంకొండ సాయి బాబా గారికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ప్రజా ఆమోదయోగ్యమైన ఇంటి స్థలాలను కేటాయించాలని సాయిబాబా గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య అర్ధవీడు మండల అధ్యక్షుడు అల్లూరయ్య సిద్ధం వెంకటేశ్వర్లు శేషాద్రి నాయుడు అటు కర్ర వెంకటేశ్వర్లు అంబటి దాసు బాబు కొంకేల రంగస్వామి వీరనాల్ల శివ కేశవ వీరగళ్ళ శ్రీకాంత్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.