మంగళ సిద్దు, ధీరజ్ ల వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధికసాయం

ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మంగళ సిద్దు మరియు తన కుమారుడు ధీరజ్ ఇద్దరు టు వీలర్ లో వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ కు గురవ్వడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను లింగాల ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా మంగళ సిద్దు, ధీరజ్ లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిమర్రి మండల కన్వీనర్ కొండ్ర చంద్రబాబు నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, జిల్లా ఐటి కో ఆర్డినేటర్ పసల శ్యామ్ సుందర్, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, దాడితోట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.