యడ్లపల్లి రామ్ సుధీర్ సహకారంతో జనసేన తరపున ఆర్థిక సాయం

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, తరకటూరు గ్రామానికి చెందిన బాస రాధ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించారు, రాధకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని స్థానిక జనసైనికులు పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ కి తెలియచేశారు. దీనిపై స్పందించిన రామ్ సుధీర్ జనసేన పార్టీ తరపున లీగల్ సెల్ నాయకులు బసు నాంచారయ్య నాయుడు చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని రాధ కుటుంబ సభ్యులకు అందచేశారు. వారి కుమార్తెల చదువుకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, బాస ఆంజనేయులు, నవీన్, శివ కిరణ్, కొఠారి మల్లి బాబు, షణ్ముఖ సాయి, బాకీ నాని, ఎఱ్ఱపోతు రాజశేఖర్, ఎస్. జగదీష్, బాదం వినోద్, పవన్ పాల్గొన్నారు.