రాజోలు జనసేన ఎంపిటిసి దార్ల కుమారి లక్ష్మీ జనసైనికుడికి ఆర్థిక సహాయం

రాజోలు, బట్టేలంక గ్రామానికి చెందిన బోనం రాజేష్ అనే జనసైనికుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో అతనికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేనపార్టీ రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి వైద్య ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. ఈ మొత్తాన్ని రాజోలు జనసేన పార్టీ పెద్దలు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిశాల బాలాజీ, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, మల్కిపురం ఎంపీపీ సత్యవాణి చేతుల మీదుగా అతని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాలుపంచుకున్నారు.