రోడ్డుప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం: గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామానికి చెందిన 25 సంవత్సరాల కాటంరాజు కుమారుడు కాకర్ల వెంకట్రావు గత కొంతకాలంగా రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెంలో నివాసం ఉంటూ పేరేచెర్ల క్వారీలో టిప్పర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా ఆదివారం డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చు సమయంలో రాజుపాలెం సమీపంలో రోడ్డప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సోమవారం ఉదయం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో మార్చురీ లో ఉన్న మృతుని శవాన్ని సందర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అంత్యక్రియల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారికి భవిషత్ లో పార్టీ అండగా ఉంటుంది అని.. ఎటువంటి సహకారం కావాలి అన్నా పార్టీ వారికి అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు తవిటి భావన్నారాయణ, నారదాసు రామచంద్ర ప్రసాద్, యర్రంశెట్టి రామకృష్ణ, సిరిగిరి శ్రీనివాసరావు, రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, పార్టీ కార్యాలయ ఇంఛార్జి సిరిగిరి మణికంఠ, వల్లెం శ్రీనివాసరావు, శాఖమూరి శ్రీనివాస్, పేమ్మా అత్తిలేష్, పోలిశెట్టి చెంచయ్య, కొమరాల రమేష్, ప్రత్తి యాగయ్య, పతేళ్ల మల్లి, గ్రంధి సదాశివరావు, అంబటి రామసాయి తదితరులు పాల్గొన్నారు.