క్రియాశీలక సభ్యునికి ఆర్థిక చేయూత

రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం కరవాక గ్రామం చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు రేఖపల్లి భాస్కర్ కుమార్ ఇటీవల ప్రమాదానికి గురవడం జరిగింది. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భాస్కర్ కుమార్ కి రూ 50,000/- రాజోలు నియోజకవర్గ నాయకుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, గుండుబోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, మామిడికుదురు మండల ఏడు గ్రామాల అధ్యక్షులు దొడ్డ జయరాం, ఉలిశెట్టి అన్నపూర్ణ, ఉండపల్లి అంజి, రాజోలు గ్రామశాఖ అధ్యక్షులు కాట్న రాజు, ఎరుబండి శివ, సాధనాల వెంకన్నబాబు, రేఖపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.