విజయవంతంగా కొనసాగిన ఇంటింటికి జనసేన 12వ రోజు

  • పోలిశెట్టి చంద్రశేఖర్ కు మహిళలు హరతులతో ఘన స్వాగతం పలుకుతూ గెలుపే లక్ష్యంగా బ్రహ్మరథం పడుతున్న అయిత పూడి గ్రామ జనసేన నాయకులు జనసైనికులు
  • గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం.. పవన్ అన్నను గెలిపిద్దాం..

రామచంద్రపురం: జనసేన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కాజులూరు మండలం, అయితపూడి గ్రామంలో శనివారం ‘ఇంటింటికి జనసేన’ మూడవ విడత కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా జనసేన ఆశయాలు, సిద్ధాంతాలు పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రజలకు తెలియజేసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయిత పూడి గ్రామ జనసేననాయకులు, ఆనాల రాము, బళ్ళ వీరబాబు, చౌదళ్ళ చిన్న, యాళ్ల అర్జున్, కొటికలపూడి నానాజీ, పెద్దిరెడ్డి భద్రం, గొల్లపల్లి సింహాద్రి రావు ఎంపీటీసీ, కృష్ణ చైతన్య, ఒరిగంటి బుజ్జి, చోడిశెట్టి శ్రీను, పెద్దిరెడ్డి సతీష్, చాగంటి సోమన్న, కామరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు, మండలనాయకులు, గ్రామకమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.