సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
గాంధీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మూడో ఫ్లోర్లో ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డు రూమ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. ఆరో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజరావు ప్రమాదం జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.