ముంబై కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

ముంబైలోని భాండవ్ లో ఉన్న ఓ కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. 70 మంది బాధితులను సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 76 మంది భాండవ్ లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి తరలి వచ్చాయి. 23 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్యను పెంచారు. ఆసుపత్రులకు కరోనా బాధితుల తాకిడి పెరిగింది.