బస్సులో అకస్మాత్తుగా మంటలు ఐదుగురు సజీవ దహనం

కర్ణాటక  లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హిరియూర్ దగ్గర నాలుగో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రహాదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా.. 27 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. అయితే ఈ ప్రైవేటు బస్సు బెంగళూరు  నుంచి విజయపురానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం మేరకు వెంటనే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం బుధవారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు