ఎపి నగర్ కాలనీలో ఇండ్లలోకి చేరిన వరద నీరు

భైంసా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భైంసాలోని కాలని వాసి లత ఇంటిలోనికి వరద ప్రవాహానికి గోడ కూలి నీరు చొచ్చుకు వచ్చి కూలర్, బెడ్, వంట వస్తువులు, బీడీ ఆకు మొత్తం నీట మునిగింది. వెంటనే వారి ఇంటిలోనికి వెళ్లి కరెంట్ కట్ చేసి, అదే ఇంట్లో అద్దెకు వున్న గర్భిణీ స్త్రీని బయటకి తీసి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసారు.అదేవిధంగా కాలనీలోని కొన్ని ఇండ్లలో వరద నీరు ప్రవహించడం వల్ల అక్కడ వాళ్ళు నివసించే పరిస్థితి లేదు. వారు ఇంటి బయటే నివసించాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి గల కారణాలు మున్సిపాలిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడింది. ఎక్కడ ఎక్కడ నుండో నీరు వరదలా రావడంతో రక్షణగా నిర్మించుకున్న గోడలు కూలిపోయి చాలా దారుణం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఇలాగే జరిగాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.