అబ్దుల్ కలాంకు ఘన నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతిని పరిష్కరించుకొని పిఠాపురం పట్టణంలో డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా భారతదేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. నేటి యువత అబ్దుల్ కలాం జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, వీరాంరెడ్డి అమర్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.