దల్లి గోవిందరెడ్డి ఆద్వర్యంలో దోమల నివారణకు ఫాగింగ్‌..

గాజువాక నియోజవర్గం, 64వ వార్డు, గంగవరం గ్రామం పలు వీధుల్లో జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పిలుపుమేరకు.. జీవీఎంసీ సిబ్బంది వారిచే దోమల నివారణకు ఫాగింగ్‌ చేయించడం జరిగింది. స్థానికులు దోమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని అటువంటి సమయంలో.. బండిని పంపించి ఇలా సర్వీస్ చేయించడం ఆనందంగా ఉందని దల్లి గోవింద రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చోడిపిల్లి ముసలయ్య, పల్లేటి దేవుడు, గంటి పిల్లి అప్పారావు, కంబాల నూకరాజు, తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.