ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: పెండ్యాల శ్రీలత
*వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: పెండ్యాల శ్రీలత
*వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత భయం
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేసేలా ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని గతంలోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ కారణంగా ఆవిర్భావ సభ సజావుగా నిర్వహిస్తే వైసిపి పార్టీ మనుగడ లేకుండా పోతుందని భావించి.. సభను అడ్డుకునేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. అయినప్పటికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించి తీరుతామని.. అనంతపురం జిల్లా నుండి వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరవుతామని రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత తెలియజేశారు.