అతి తక్కువ సమయంలో 125 క్రియాశీలక సభ్యత్వాలు

ఆచంట నియోజకవర్గం నుంచి ఏకైక వీరమహిళగా లాగ్-ఇన్ తీసుకొని అతి తక్కువ సమయంలో 125 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన శ్రీమతి మేకల చంద్రకుమారి ని పెనుగొండ మండల వీరమహిళల ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరమహిళలు మాట్లాడుతూ… ఆచంట నియోజకవర్గంలో ఏకైక వీర మహిళగా లాగ్-ఇన్ తీసుకొని 125 క్రియాశీలక సభ్యత్వాలు తక్కువ సమయంలో చేయడం మాకు ఎంతో గర్వకారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల వీరమహిళలు కంబాల మణిమాల, బళ్ళ ప్రసన్న, కొత్త కోటేశ్వరి, కాకి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.