రామశ్రీనివాసులు సమక్షంలో జనసేనపార్టీలో చేరిన మాజీ సర్పంచ్!!

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి సుండుపల్లి మండలం భాగంపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాము నాయక్, అలానే ఆయన వర్గంతో పాటుగా పలువురు కృష్ణా నాయక్, మున్నా నాయక్, శ్రీనివాస్ నాయక్, రాజు నాయక్, తదితరులు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ, సిదాంతాలకు ఆకర్షితులై రామశ్రీనివాసులు సమక్షంలో జనసేనలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ రాజంపేట జనసేనపార్టీ తరపున రామశ్రీనివాసులు వారందరినీ పార్టీలొకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలపడం జరిగింది.