జనసేన తీర్ధం పుచ్చుకున్న మాజీ జడ్పిటిసి నిమ్మల నిబ్రం

పార్వతీపురం మాన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం భామిని మండలం మనుమకొండ గ్రామానికి చెందిన గిరిజన నేతమరియు మాజీ జడ్పిటిసి “నిమ్మల నిబ్రం” మంగళవారం జనసేన తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, పిసిని చంద్రమోహన్, ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, భామిని మండల నాయకులు రుంకు కిరణ్, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.