చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు నియోజకవర్గం: బట్టేలంక గ్రామానికి చెందిన జనసేన నాయకులు బోనంసాయి (బి.ఎస్ కోకోనట్స్) సతీమణి బోనంశకుంతల పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతం జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శనివారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోందికోడప మరియు గొంది పద్మరాజు కాలనీ ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.