ఓ.ఎన్.జీ.సీ ఆధ్వర్యంలో ఉచిత ఫీల్డ్ ఓపీడి క్లినిక్
రాజోలు: కేశవదాసుపాలెం గ్రామంలో పంచాయితి కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ మేడిది సరోజ భరత్ అధ్వర్యంలో ఓ.ఎన్.జీ.సీ వారి ఆధ్వర్యంలో ఓపీ క్లినిక్ ప్రారంభించడమైనది. ఈ క్లినిక్ నందు ప్రతి నెల 2వ మరియు 4వ శుక్రవారం ఉచితంగా వైద్యం చేయబడును. ఈ క్లినిక్ నందు అన్ని రకాలైన అనారోగ్య సమస్యలకు చికిత్స అందించి, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉండపల్లి సాయి కుమారి అంజి, ఓ.ఎన్.జీ.సీ సిబ్బంది మోరి జిసిఎస్ ఐఎమ్ ఈటి శ్రీనివాస్, ఇంచార్జీ మెడికల్ ఏఐ డా. అహ్మద్, డాక్టర్ రామ్మోహన్ డాక్టర్ రమ్య, డాక్టర్ సిసిలి, డాక్టర్ సాంసంగ్, డాక్టర్ అభిషేక్, ఫార్మసిస్ట్ సుమన్, ప్రదీప్, నర్స్ లక్ష్మి, అంబులెన్స్ అండ్ మెడికల్ హెల్పర్ కోటి, వార్డ్ నెంబర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.