శ్రీమతి కాంతిశ్రీ ఆధ్వర్యంలో మంచినీరు బోరు

శ్రీకాకుళం జిలా, ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ బుధవారం ఉదయం రణస్థలం మండలంలో కొవ్వాడ గ్రామంలో ఆమె సొంత నిధులతో మంచి నీరు బోరుకి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు కొవ్వాడ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.